కేశవరావు జాదవ్​ స్మారక చిహ్నం పెట్టాలి

కేశవరావు జాదవ్​ స్మారక చిహ్నం పెట్టాలి
  • సీఎం రేవంత్​ రెడ్డికి  ఉద్యమకారుల విజ్ఞప్తి

ఖైరతాబాద్, వెలుగు: ప్రొఫెసర్​ కేశవరావు జాదవ్​ జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా తెలియజేయాలని తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని కోరారు. తెలంగాణ యునైటెడ్​ ఫ్రంట్​ఆధ్వర్యంలో ‘వలస విముక్త నవ తెలంగాణ కోసం పోరాడుదాం’ పేరుతో సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్​జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రజా గాయకురాలు విమలక్క , మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్​ కుమార్, హనుమాండ్లు మాట్లాడారు. కేశవరావు జాదవ్ ​హైదరాబాద్​లోని హుస్సేని ఆలంలో పుట్టారని, మిస్టర్ తెలంగాణగా గుర్తింపు పొందారని  గుర్తుచేశారు. ఎక్కువకాలం ఇంగ్లిష్ ప్రొఫెసర్​గా పనిచేసిన ఓయూ ఇంజనీరింగ్​ కాలేజీకి ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.