మహీంద్రా గ్రూప్ మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా (99) కన్నుమూత

మహీంద్రా గ్రూప్ మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా (99) కన్నుమూత

మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త కేశబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. 1963 నుంచి 2012వరకు ఈయన మహీంద్రా గ్రూపుకు ఛైర్మన్ గా ఉన్నారు. ఇక ఆయన మరణ వార్తను మహీంద్రా గ్రూప్ మాజీ ఎండీ పవన్ గోయెంకా ధృవీకరించారు. ఈ సందర్భంగా కేశబ్ మహీంద్రా ఇక లేరు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేశబ్ మరణంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐసీఐసీఐ లాంటి ప్రముఖ కంపెనీ బోర్డుల్లో  కేశబ్ మహీంద్రా కీలక బాధ్యతలు నిర్వహించారు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గానూ కేషబ్ ఉన్నారు.  

https://twitter.com/GoenkaPk/status/1646012668103495681