
ఖమ్మం: కొత్తగా మంజూరైన డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్పు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు. రైల్వే లైన్ అలైన్మెంట్ను మార్చాలని కోరుతూ ఎంపీని ఆయా మండలాల చెందిన ప్రతినిధులు కలిశారు. ప్రసుత్త అలైన్మెంట్తో ఖమ్మం రూరల్ మండల్లాలో లైన్ రానుందని ఎంపీకి వివరించారు.
దీంతో విలువైన వ్యవసాయ భూములకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. రైతులకు మేలు జరిగేలా అలైన్మెంట్ మార్చాలని వారు కోరారు. ఈ సమస్యను త్వరలోనే రైల్వే జీఎం, కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీకి వినతి పత్రాన్ని అందజేశారు