
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి విజయం సాధించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ భారీ కేకు కట్ చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అన్నదానం చేశారు.