ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఒకే సినిమాతో రెండు భాషల ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతోంది కియారా అద్వానీ. బ్యాక్ టు బ్యాక్ రెండు తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీస్లో నటించబోతోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్స్తో బిజీ అయ్యిందామె. చిన్న గ్యాప్ తర్వాత తిరిగి సౌత్లో రెండు సినిమాలకు కమిటైంది. అందులో మొదటిది ఇటీవల మొదలైన రామ్ చరణ్ ప్యాన్ ఇండియా మూవీ. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక తాజాగా కియారా ఖాతాలో మరో సినిమా చేరింది. ఇదీ దిల్ రాజు బ్యానర్లోనే కావడం విశేషం.
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరో యిన్గా కియారాని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. విజయ్కి ఇదే ఫస్ట్ తెలుగు సినిమా కావడంతో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కియారాకి వెంటనే విజయ్ లాంటి టాప్ స్టార్ సినిమాలో చాన్స్ రావడంతో ఇక సౌత్లోనూ ఆమె పాగా వేయడం ఖాయమంటున్నారు. నార్త్లో భూల్ భులయ్యా 2, జుగ్ జుగ్ జియో, మిస్టర్ లేలే మూవీస్ చేస్తున్న కియారా.. సౌత్లో మాత్రం వరుస క్రేజీ ప్రాజెక్టుల్ని బ్యాగ్లో వేసుకోవడం విశేషమే.