మాదన్న పేటలో కిడ్నాప్కు గురైన పాప సేఫ్

మాదన్న పేటలో కిడ్నాప్కు గురైన పాప సేఫ్

పాతబస్తీ మాదన్నపేట్ లో కిడ్నాప్ కి గురైన 9 నెలల పాప సేఫ్ చేశారు. ఈ కేసులో భాగంగా జహీరాబాద్ లో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. 

చంచల్ గూడలోని నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో 9 నెల పాపను పనిమనిషి కిడ్నాప్ చేసింది. ఇంట్లోని పనులన్నీ ముగించుకొని పాపను కిడ్నాప్ చేసి.. ఆ మహిళ చతీస్ గఢ్ కి పరారీ అయింది. దీంతో పాప తల్లిదండ్రులు మాదన్న పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ తన పని చేసే దగ్గర ఆమె ఇచ్చిన ఐడి ప్రూఫ్ ప్రకారం.. పోలీసులు కిడ్నాప్ చేసిన మహిళ చతీస్ గఢ్ కు చెందిన ఆమెగా గుర్తించారు. కాగా సీసీటీవీ ఆధారంగా మదన్నపేట్ పోలీసులు దర్యాప్తు చేశారు. చంచల్ గూడ నుంచి ఎంజీబీఎస్  వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవగా.. ఎంజీబీఎస్ స్టేషన్ లో జహీరాబాద్ బస్ లో వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు.