తిరుపతిలో కిడ్నాపర్.. రౌడీషీటర్ హల్ చల్.. సినీ పక్కీలో పట్టుకున్న పోలీసులు

తిరుపతిలో కిడ్నాపర్.. రౌడీషీటర్ హల్ చల్.. సినీ పక్కీలో పట్టుకున్న పోలీసులు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో రౌడీషీటర్​ హల్​ చల్​ చేశాడు.   ఇద్దరు మహిళలను కిడ్నాప్​ చేసిన రౌడీషీటర్​ అజీమ్​.. తన మాట వినకపోతే చంపేస్తానని కత్తులతో  బెదిరించాడు.  కిడ్నాప్​ నకు గురయిన మహిళ అతని తెలియకుండా తన భర్తకు లొకేషన్​ చేసింది. 

మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా..  శుక్రవారం  ( సెప్టెంబర్​ 12) రాత్రి విధుల్లో ఉన్న సిఐ రామకిషోర్ బృందం చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు.  పోలీసులు వెంట పడుతున్నారని గమనించిన కిడ్నాపర్​ పారిపోయేందుకు ప్రయత్నించాడు.  ఈ ప్రయత్నంలో     రెండు కార్లను,ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ   జనాలను భయబ్రాంతులకు గురి చేస్తూ ...పారిపోయేందుకు  ప్రయత్నించాడు.  

ఎట్టకేలకు  అలిపిరి సీఐ ఆధ్వర్యంలోని గస్తీ  బృందం  కిడ్నాపర్​ ను సినీ తరహాలో  వెంబడించి పట్టుకున్నారు.  కిడ్నాప్​ నకు గురైన తల్లీకూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చి.. నిందితుడైన రౌడీషీటర్​ ను అదుపులోకి తీసుకొని  ఈస్ట్​ పోలీస్​ స్టేషన్​ లో అప్పగించారు.  నిందితుడిని అజీమ్​గా గుర్తించిన పోలీసులు.. ఈ రౌడీషీటర్ పై​ గతంలో పలు కేసుల్లో అరెస్టయి జైలు జీవితం గడిపాడు. అజీమ్​ పై 
 ఈస్టు, ఎంఆర్ పల్లి,అలిపిరి,మహిళా పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు.