నవంబర్ 11న.. దీపావళి

నవంబర్ 11న.. దీపావళి

పలు సూపర్ హిట్ చిత్రాలతో నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న  స్రవంతి రవి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు.  పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో  ‘దీపావళి’ పేరుతో విడుదల చేస్తున్నారు.  

నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌‌ కానుంది. గురువారం ఈ మూవీ ట్రైలర్‌‌ను హీరో రామ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చాలా ఇంటరెస్టింగ్‌‌గా ఉందని, మేక కథ  కోసం సిద్ధంగా ఉండమని ట్వీట్ చేశాడు.  పల్లెలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను సహజంగా ఇందులో చూపించారు. తాత, మనవడు, మేక మధ్య కథ తిరుగుతూ ఉంటుంది.