పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్​ అయిందని 14 ఏళ్ల కూతురిని చంపిన తండ్రి

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్​ అయిందని 14 ఏళ్ల కూతురిని చంపిన తండ్రి

గొంతు నులిమి చంపి, తల నరికిండు

యూపీలోని  షాజహాన్​పూర్​లో దారుణం

షాజహాన్​పూర్(యూపీ): యూపీలో మరో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్​ అయిన మైనర్ కూతురును  తండ్రే చంపేశాడు. డెడ్​బాడీని నాలాలో పడేసిండు. గత నెల 24న హత్య జరగగా.. మంగళవారం నాడు డెడ్​బాడీ బయటపడడంతో కేసు వెలుగులోకి వచ్చింది. షాజహాన్​పూర్​ జిల్లాలోని దుల్హాపూర్​గ్రామంలో ఈ హత్య చోటుచేసుకుంది. డెడ్​బాడీని గుర్తించి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పోలీసు విచారణలో హత్య వెనకున్న కారణాలు బయటపడ్డాయి. హత్యకు గురైన అమ్మాయి ఆరు నెలల కడుపుతో ఉందని తేలింది. దీంతో పరువు హత్య అనే కోణంలో విచారించిన పోలీసులు మృతురాలి కుటుంబాన్ని ప్రశ్నించారు. పోయిన నెలలోనే హత్య జరిగినా పోలీసులకు ఎందుకు కంప్లైంట్​ చేయలేదని నిలదీయడంతో తానే హత్య చేసినట్లు మృతురాలి తండ్రి ఒప్పుకున్నడు. పెళ్లి కాకుండానే కూతురు ప్రెగ్నెంట్ కావడం తట్టుకోలేకపోయానని, దానికి కారణం ఎవరని ఎంతగా అడిగినా కూతురు చెప్పలేదన్నాడు. అతడెవరో తెలుసుకుని ఇద్దరికీ పెళ్లి చేయాలని భావించానన్నాడు. అయితే, ఎంత అడిగినా చెప్పకపోవడంతో ఊళ్లో పరువు పోతుందనే భయంతో కూతురిని చంపేసినట్లు తెలిపాడు. గొంతు నులిమి చంపేసి, డెడ్​ బాడీని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు తల నరికినట్లు చెప్పాడు. ఆపై బాడీని డ్రైనేజ్​లో పడేసినట్లు చెప్పాడు. ఈ హత్యలో తండ్రితో పాటు కొడుకు పాత్ర కూడా ఉందని పోలీసులు చెప్పారు. తండ్రిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న కొడుకు కోసం గాలిస్తున్నామని వివరించారు. మైనర్​ను ప్రెగ్నెంట్​ను చేసిన వ్యక్తిని కూడా గుర్తించి, అరెస్టు చేస్తామన్నారు.