మళ్లీ -కైనెటిక్ స్కూటర్లు వచ్చేస్తున్నయ్

మళ్లీ -కైనెటిక్ స్కూటర్లు వచ్చేస్తున్నయ్

–న్యూఢిల్లీ: ఒకప్పుడు పెట్రోల్​ స్కూటర్లను తయారు చేసిన ఆటోమొబైల్​ కంపెనీ కైనెటిక్ తాజా ఎలక్ట్రిక్​ వెహికల్స్​తో ముందుకు వచ్చింది. మనదేశ మార్కెట్లోకి కైనటిక్​ డీఎక్స్​ఈవీని లాంచ్​చేసింది.

 దీని ధరలు రూ. 1.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 1.17 లక్షల వరకు ఉంటాయి. ఒక్కసారి చార్జ్​చేస్తే 116 కి.మీ వరకు ప్రయాణిస్తాయి. మ్యాగ్జిమమ్ ​స్పీడ్​ గంటకు 90 కిలోమీటర్లు. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ల డెలివరీలు సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.