_w0ijzTQVe6.jpg)
న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో హైదరాబాద్ 17–11తో ముంబై మజిల్పై నెగ్గింది. దీంతో ఈ సీజన్లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అండర్ కార్డ్లో 2–1తో ఆధిక్యంలో నిలిచిన హైదరాబాద్.. మెయిన్ కార్డ్లో తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ముంబైపై విజయంలో హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్ మధుర కెఎన్ కీలక పాత్ర పోషించింది.