తెలంగాణలో దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చిన్రు: కిషన్ రెడ్డి

తెలంగాణలో దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చిన్రు: కిషన్ రెడ్డి

మరోసారి దేశానికి ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.  వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రేస్ పార్టీ మరింత బలహీనపడుతుందన్నారు.కర్ణాటకలో 90 శాతం ఎంపీ స్దానాలు బీజేపీ గెలుస్తోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో శుక్రవారం కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  గత ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను  అమలు చేసే సత్తా కాంగ్రేస్ కు లేదన్నారు. 

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రేస్ నడుస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో రియార్టర్లు, బిల్డర్లను, వ్యాపారులను రాహుల్ గాంధీ ట్యాక్స్ కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రేస్ పార్టీలో చేరాలని సీఎం రేవంత్ రెడ్డ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని చెప్పారు.
 కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోల్డ్ స్టోరేజ్ లో ఉందని..  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్జి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి..తాగునీటి ఎద్దడి నెలకొంది.. అయినా ప్రభుత్వానికి పట్టింపులేదని మండిపడ్డారు. తెలంగాణలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారని ఆయన విమర్శించారు

గత కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్  సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మా పాలన నాలుగు ప్రధాన అంశాలపై సాగుతుందని చెప్పారు. భవిష్యత్ ఎట్టి పరిస్ధితిలో ఎరువుల ధరలు పెంచరాదని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. ఇందుకు కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందన్నారాయన. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్దానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.