సోమేశ్‌‌కుమార్.. పెద్ద తిమింగలం: కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి

సోమేశ్‌‌కుమార్.. పెద్ద తిమింగలం: కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి

హైదరాబాద్ వెలుగు: రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలు కీలక భాగం అని కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ వీఆర్వోలను తప్పించి తిమింగలాలకు రెవెన్యూ వ్యవస్థను అప్పజెప్పారని ఆయన మండిపడ్డారు. ‘‘అన్ని తిమింగలాలకెల్లా మాజీ సీఎస్, సీఎం చీఫ్ అడ్వయిజర్‌‌‌‌ సోమేశ్‌‌కుమార్ అత్యంత పెద్ద తిమింగళం” అని సోమవారం గాంధీభవన్​లో మీడియాతో అన్నారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్థం లేనివన్నారు.  సుమారు 22 లక్షల రైతు కుటుంబాలకు హక్కు పత్రాలను ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

పెద్ద తిమింగలం సోమేశ్‌‌కుమార్‌‌‌‌కు చీఫ్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వడం వెనుక మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి అవకతవకలపై విచారణ చేయిస్తామన్నారు. భూ గ్యారంటీ చట్టం కూడా తీసుకొస్తామని తెలిపారు.