ప్రమాణ స్వీకారం గురించి మండలి ఛైర్మన్ కు సమాచారం ఇవ్వలేదన్నారు టీజీఎస్ అధ్యక్షులు కోదండరాం. ఇవాళ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి కోదండరాం,అలీఖాన్ లు మండలికి వెళ్లారు. అయితే అక్కడ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరు. దీంతో కాసేపు వెయిట్ చేశారు కోదండరాం. అనంతరం మాట్లాడిన ఆయన.. తాము మండలి ఛైర్మన్ కు సమాచారం ఇవ్వకుండా వచ్చామన్నారు. మండలి ఛైర్మన్ కు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు..అయితే వస్తారేమోనని కాసేపు వెయిట్ చేశామన్నారు. జనవరి 30న ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. సెక్రటరీతో మండలి ఛైర్మన్ కు సమాచారం పంపించామన్నారు. మండలి ఛైర్మన్ తమకు ఫోన్లో టచ్ లోకి రాలేదన్నారు.
గవర్నర్ కోటాలో ఇంతకుముందు ఇద్దరిని నామినేట్ చేసిన వారి విషయంలో కోర్టు కేసు నడుస్తుందన్నారు. రాజ్యాంగ బద్దంగానే తాము నామినేట్ అయ్యామన్నారు. తమ ఎన్నికకు సంబంధించి గవర్నర్ కూడా గెజిట్ విడుదల చేసిందని చెప్పారు.