ఇన్నాళ్లు కేసీఆర్ కు గుర్తుకు రాలేదా?

ఇన్నాళ్లు కేసీఆర్ కు గుర్తుకు రాలేదా?

సెప్టెంబర్ 17ను ఇన్నాళ్లు అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ కు గుర్తుకు రాలేదా అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజాస్వామిక స్పూర్తి అవలంబించాలని చెప్పారు. బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం సరైంది కాదన్నారు.

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరామ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను గుర్తించామని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతోనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందన్నారు. భూస్వామ్య వ్యవస్థను అంతమొందించడంలో సోషలిష్టులు, కమ్యూనిస్టులు కీలక పాత్ర వహించారని కోదండరామ్ తెలిపారు.