
కొడంగల్, వెలుగు: రాజకీయ పార్టీలు బూత్లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏలు)ను నియమించుకోవాలని అడిషనల్కలెక్టర్ లింగ్యానాయక్సూచించారు. మంగళవారం కొడంగల్ తహసీల్దార్కార్యాలయంలో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపుల పరిశీలిన కోసం బీఎల్ఏలు అవసరమన్నారు. అలాగే 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్బలరాం నాయక్, తహసీల్దార్ విజయ్కుమార్, డీటీ అనిత తదితరులు పాల్గొన్నారు.