శ్రీవారి ఆలయ విస్తరణకు లైన్ క్లియర్

శ్రీవారి ఆలయ విస్తరణకు లైన్ క్లియర్
  • భూ నిర్వాసితులతో మాట్లాడిన కలెక్టర్

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్​లోని పద్మావతి సమేత శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు లైన్​క్లియర్ అయ్యింది. ఆలయ విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులతో కలెక్టర్​ప్రతీక్​జైన్ కలెక్టరేట్​లో బుధవారం ​ సమావేశమయ్యారు. 

సుమారు 8 వేల గజాల్లో భూసేకరణకు సంబంధించి ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలతో మాట్లాడారు. భూమి విలువ, ఇండ్ల విలువను బట్టి నష్టపరిహారంతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్​చెల్లిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ లింగ్యా నాయక్, డీఆర్వో మంగీలాల్, కడా స్పెషల్​ఆఫీసర్​ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.