పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని పర్యటించారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్ పేట్, దుద్యాల్, కొత్తపల్లి కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే ఆరు హామీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్… మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేశామన్నారు.
బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని మోదీ.. గల్లీ కేసీఆర్ కలిసి రేవంత్ రెడ్డిపై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. చింతమడకలో పుట్టిన కేసీఆర్... అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు పలకరించలేదని ప్రశ్నించారు. మానవత్వం లేని వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం అయితే మన బతుకులు బాగుపడతాయా.. అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే అవినీతి సొమ్మును ప్రజల ఖాతాల్లో జమచేస్తామన్నారు.