కొడంగల్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గవర్నమెంట్కాలేజీలు, గురుకులాల స్టూడెంట్లు సత్తా చాటారు. వికారాబాద్జిల్లా కొడంగల్ గవర్నమెంట్ జూనియర్కాలేజీ సెకండ్ఇయర్ స్టూడెంట్ పూజ బైపీసీలో 958 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో తమ ఫస్ట్ఇయర్ స్టూడెంట్లు 66 శాతం, సెకండ్ ఇయర్స్టూడెంట్లు 50 శాతం పాస్అయ్యారని కాలేజీ వైస్ప్రిన్సిపాల్మదుసూధన్రెడ్డి తెలిపారు. ఎంపీసీలో కృష్ణకుమార్ 835, హెచ్ఈసీలో రజిత 843 మార్కులు సాధించారని చెప్పారు.
గురుకుల స్టూడెంట్ల హవా
గండిపేట: నార్సింగి గురుకుల స్టూడెంట్లు ఇంటర్ఫలితాల్లో సత్తా చాటారు. ఫస్ట్ఇయర్స్టూడెంట్లు 99 శాతం, సెకండ్ఇయర్స్టూడెంట్లు100 శాతం ఉత్తీర్ణత సాధించారని కాలేజీ ఆర్సీఓ ఆర్.శారద, ప్రిన్సిపాల్ ఎల్.బి.కృపావరం తెలిపారు. ఫస్ట్ఇయర్బైపీసీలో కె.హాసిని 437 మార్కులు, పి.మధుమిత 437, హరిక 436, ఎంపీసీలో విక్టోరియా రాణి467, సిరిమల్లి 467, భావన 466, ఎన్.ప్రియాంక 466, ఆర్.హర్షిత 466 మార్కులు సాధించారని చెప్పారు. సెకండ్ఇయర్ఎంపీసీలో బి.తరుణిక 986, జె.గౌరమ్మ 984, బైపీసీలో ఎం.అలేఖ్య 977, వి.నాన్సీ 976 మార్కులు సాధించారని చెప్పారు.