
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: గత ప్రభుత్వాలు భూమి లేని పేదలకు రెండెకరాల చొప్పున కేటాయించాయని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ రైతులు తెలిపారు. ఈ భూమే తమకు జీవనాధారమని, 50 ఏండ్లుగా పంటులు పండించుకుంటున్నామని అన్నారు. కొహెడ లో సర్వే నంబర్187/1లో తమకు ఇచ్చిన భూమిని ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని, అలా చేయొద్దని వేడుకున్నారు. ఆదివారం సదరు భూమిలో సమావేశమై మాట్లాడారు. మొత్తం 286 ఎకరాల భూమిని కొహెడకు చెందిన 100కు పైగా రైతు కుటుంబాలు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల రెవెన్యూ అధికారులు ఫ్రీ కాస్ట్ వాల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నామని చెప్పారు. భూమిని లాక్కోవద్దని, తమకు పట్టాలు ఇచ్చి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.