
బ్యాటింగ్తో అభిమానులను అలరించే విరాట్ కోహ్లీ..లంకతో జరిగిన రెండో వన్డే తర్వాత డ్యాన్స్తోనూ ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో గెలిచిన తర్వాత టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ తో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈడెన్ గార్డెన్లో రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్లతో విజయం సాధించింది. తొలి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ ఈ మ్యాచ్ లో కేవలం 4 పరుగులే చేశాడు. అయితే కోహ్లీ విఫలమైనా..కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రాణించడంతో ..216 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 40 బంతులుండగానే ఛేదించింది. దీంతో వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, ఇషాన్ కిషన్ అభిమానులను అలరించారు. ఇద్దరూ కలిసి గ్రౌండ్లో స్టెప్పులేశారు. కోహ్లీ, ఇషాన్ కిషన్ కు సంబంధించిన డ్యాన్స్ ను ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్గా మారింది.