ఆఫ్గానిస్థాన్ పై కోహ్లీ సెంచరీ

ఆఫ్గానిస్థాన్ పై కోహ్లీ సెంచరీ

దుబాయి: ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. మొన్న పాకిస్థాన్ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ..  తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇవాళ ఆఫ్గనిస్థాన్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో కేవలం 53 బంతుల్లో సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. మొత్తం 61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో ఇండియా 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ 122 పరుగుల్లో 84 రన్స్ బౌండరీ (ఆరు 6, 12 ఫోర్లు) రూపంలో వచ్చాయి. ఇక 200 స్క్రైక్ రేట్ తో ఆఫ్గానిస్థాన్ బౌలర్లను  కోహ్లీ ఊచకోత కోశాడు. 1020 రోజుల (దాదాపు మూడేళ్లు ) తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు.