Shreyas iyer:శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్... కోహ్లీ ఆశ్చర్యం

Shreyas iyer:శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్... కోహ్లీ ఆశ్చర్యం

బ్యాటింగ్ తో అలరించే టీమిండియా బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్..లంకతో జరిగిన మూడో వన్డేలో కొత్త అవతారం ఎత్తాడు. బ్యాట్ తో మెరుపులు మెరిపించే ఆయన చివరి వన్డేలో బౌలింగ్ లో సత్తా చాటాడు. శ్రేయాస్ బౌలింగ్ వేయడంపై విరాట్ కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు


శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ ఆఫ్ స్పిన్ వేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 18 ఓవర్ చేసేందుకు బాల్ ను కెప్టెన్ రోహిత్ శర్మ అయ్యర్ చేతికి అందించాడు. ఈ క్రమంలో  ఓవర్ లో  తొలి బంతిని వేయగా.. అది అనూహ్యంగా టర్న్ అయింది. అక్కడే  స్లిప్ లో  ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. అయ్యర్ బంతి టర్న్ అవడం చూసి షాకయ్యాడు.  ప్రస్తుతం  ఇందుకు సంధించిన వీడియో వైరల్ అయింది. ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క ఓవర్ వేసిన శ్రేయాస్ అయ్యర్.. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు.