శర్మిష్టకు నో బెయిల్ : కోల్​కతా హైకోర్టు

శర్మిష్టకు నో బెయిల్ : కోల్​కతా హైకోర్టు
  • మాట్లాడే స్వేచ్ఛ​ అంటే ఇతరులను నొప్పించడం కాదు: కోల్​కతా హైకోర్టు

కోల్​కతా: సోషల్​ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, లా స్టూడెంట్  షర్మిష్ట పనోలీకి కోల్​కతా హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ నిరాకరించింది. స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు కాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఆమెపై గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్ పరిధి బయట దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తూ,  కేసును 5కు వాయిదా వేసింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో శర్మిష్ట తన ఇన్‌స్టాలో పలు పోస్టులు చేశారు.

 ఒక పోస్టులో.. భారత్​, పాక్​ యుద్ధంపై బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇదే పోస్టులో ఆమె చేసిన కామెంట్స్​పై విమర్శలు వచ్చాయి. దీంతో షర్మిష్ట క్షమాపణలు చెబుతూ ఆ పోస్టును తొలగించారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసులు నమోదు కాగా, గత వారం కోల్​కతా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.