
తాను పార్టీ మారుతున్నారనే ఊహాగానాలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే..తెలంగాణలో గెలవాలని ఏముందని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ లోకి తిరిగి వస్తానని ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్ ను గద్దె దించడానికే బీజేపీలో చేరానని చెప్పారు.
కాంట్రాక్ట్ ల కోసం పార్టీ మారేవాడినైతే తనను కేసీఆర్ చాలా సార్లు బీఆర్ఎస్ లోకి రమ్మన్నారని రాజగోపాల్ చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని అన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మోడీ, అమిత్ షా నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్నారు.
తాను డబ్బులకు అమ్ముడుపోయే మనిషిని కానన్నారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ తో గంటసేపు మాట్లాడినట్లు చెప్పారు. తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను మార్చాలని ఎవరూ లాబీయింగ్ చేయడం లేదన్నారు.