నవ్వుతూ పలకరించుకున్న రేవంత్, కోమటిరెడ్డి

నవ్వుతూ పలకరించుకున్న రేవంత్, కోమటిరెడ్డి

ధర్నా చౌక్ వారిద్దరిని దగ్గర చేసింది. పీసీసీ పదవితో దూరంగా ఉంటున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఒక్కటి చేసింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర వరిదీక్ష పేరుతో నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఉదయం హాజరవ్వగా... ఆ తర్వాత కోమటి రెడ్డి వచ్చారు. అయితే పీసీసీ పదవితో రేవంత్ రెడ్డిపై డైరెక్ట్ గానే విమర్శలు చేశాడు కోమటి రెడ్డి. అంతే కాదు ఒకానొక టైంలో గాంధీ భవన్ లో అడుగు పెట్టనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత వీహెచ్ మధ్య వర్తిత్వంతో.. ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశాడు. కానీ అవేవి ఫలించక పోయినా.... ధర్నా చౌక్ వారిని దగ్గర చేసింది. ధర్నా చౌక్ స్టేజ్ పైకి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాగానే... రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత స్టేజ్ పై ఇద్దరు ఒకే దగ్గర కూర్చుకున్నారు. ఒకరిని ఒకరు నవ్వూకుంటూ పలకరించుకున్నారు.