
- కేంద్ర మంతులకు విన్నవించినా మార్పు చేయలేదు
- అలైన్ మెంట్ నోటిఫికేషన్ పై సీఎం, ఆఫీసర్లూ చెప్పలేదు
- ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోను.. కొట్లాడుతా.. పదవీ త్యాగం చేస్తా
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
సంస్థాన్ నారాయణపురం, వెలుగు: “ ట్రిపుల్ ఆర్ఉత్తర భాగం అలైన్మెంట్ మారితే.. దక్షిణ భాగం మారుతుంది. ఇవి రెండూ మారాలంటే.. ప్రభుత్వమే మారాలేమో..!” అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు సెగ్మెంట్ లోని ట్రిపుల్ఆర్బాధితులతో ఆదివారం సంస్థాన్నారాయణపురంలో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ఉత్తర భాగం అలైన్మెంట్మార్పు కోసం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, కిషన్రెడ్డి, బండి సంజయ్కలిసి విన్నవించానని తెలిపారు.
సీఎం, ఆఫీసర్లు ఎవరూ కూడా సమాచారమివ్వలేదని, హెచ్ఎండీఏ నోటిఫికేషన్ను పేపర్ లో చూసిన తర్వాతే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ట్రిపుల్ఆర్కారణంగా మునుగోడు నియోజకవర్గ రైతులే ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. అలైన్మెంట్ విషయంలో ప్రజలకు అన్యాయం జరిగితే సహించనని, ప్రభుత్వంతో కొట్లాడతానని, అవసరమైతే మళ్లీ పదవీ త్యాగం చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.