
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందని రాజగోపాల్ ఆరోపించారు. తెలంగాణ అంటే కొడుకు, కూతురు మాత్రమే ఉన్నారా.. ప్రజల అవసరాలు కనపడలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎనిమిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆరోపించారు. మోడీ విధానాల ఫలితంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ భారత్ వైపు చూస్తుందన్నారని అన్నారు.
ఆలేరు ఎమ్మెల్యే అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు కూడగట్టుకున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంపై 68% ప్రజా వ్యతిరేకత ఉందన్న ఆయన..రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రతి కార్యకర్త ఎప్పటి కప్పుడు ఎండగట్టాలని సూచించారు.