ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చండూరు (నాంపల్లి), వెలుగు : కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజీనామా చేశారని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన పలువురు లీడర్లు  శుక్రవారం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కన చేరి తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. అభివృద్ధి కోసమే రాజీనామా చేసినట్లయితే అదే పార్టీ నుంచి గెలిచిన మిగిలిన నలుగురు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారని  విమర్శించారు. బీజేపీకి ఓట్లు వేస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ శ్వేతా 
రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీ ఏవీ.రెడ్డి, మర్రిగూడ ఎంపీపీ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు.

రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపోకి చెందిన సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లగ్జరీ బస్సు శుక్రవారం 25 మంది ప్యాసింజర్లతో విజయవాడ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్తోంది. ఈ క్రమంలో చిట్యాల మండలం వెలిమినేడు శివారులోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడడంతో వారిని కామినేని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

మెనూ కచ్చితంగా పాటించాలి

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/గరిడేపల్లి/కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం కరక్కాయలగూడెం, గరిడేపల్లి మండలం మంగాపురం, చిలుకూరు మండలంలోని పలు స్కూళ్లను శుక్రవారం సూర్యాపేట డీఈవో అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్ల హాజరు పరిశీలించారు. క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి స్టూడెంట్లతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు. మంగాపురంలో గ్రామ పంచాయతీకి కేటాయించిన రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకోవాలని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు క్రమం తప్పకుండా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలని సూచించారు.

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

చండూరు, వెలుగు : డిండి ఎత్తిపోతల పథకం ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని నల్గొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కృష్ణారెడ్డి చెప్పారు. నాంపల్లి మండలం కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంపునకు గురవుతున్న లక్ష్మణాపురం నిర్వాసితులను శుక్రవారం కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2016లో నిర్వహించిన సర్వేలో చాలా ఫ్యామిలీలను గుర్తించలేదని, కొందరికి ఇండ్ల నిర్మాణ స్థలాలకు సైతం వ్యవసాయ భూమి తరహా పరిహారం ఇచ్చారని నిర్వాసితులకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు. ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఒక కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీని రూ. 20 లక్షలకు పెంచి, రంగారెడ్డి జిల్లాలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు కట్టించి, పునరావాసం కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే నిర్వాసితులకు పరిహారం అందజేశామన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని, పునరావాస పరిహారం పెంపు, రంగారెడ్డి జిల్లాలో ఇండ్ల కేటాయింపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, నీటిపారుదల శాఖ ఈఈ ఎలమందయ్య, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీడీవో శేషుకుమార్, డీఈలు జానునాయక్, సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

నకిరేకల్, వెలుగు : టీచర్ల సమస్యలను పరిష్కరించాలని పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూ నల్గొండ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కార్యదర్శి కాలం నారాయణరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన సభ్యత్వ నమోదులో వారు మాట్లాడారు. టీచర్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్లు, ప్రమోషన్లను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కడారి అనిత, ప్రధాన కార్యదర్శి కందాళ చంద్రారెడ్డి పాల్గొన్నారు.

434 కిలోల గంజాయి పట్టివేత

8 మంది అరెస్ట్, పరారీలో ఆరుగురు

మిర్యాలగూడ, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 434 కిలోల గంజాయిని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాలోని మల్కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి జిల్లా చిత్రకొండ మండలం అల్లూరికోటకు చెందిన మజ్జి శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ధూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గంజాయి సప్లై చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో గంజాయి తీసుకొచ్చేందుకు గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్నేహితుడైన చందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా తూర్పుగోదావరి జిల్లా మాడపేటకు చెందిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివకు స్కోడా కారు ఇచ్చి మల్కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి పంపాడు. అతడు గంజాయిని కారులో లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని తిరిగి వస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా చందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బండి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పైలటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు వీరిని ఆపి ప్రశ్నించడంతో గంజాయి రవాణా విషయం వెలుగు చూసింది. దీంతో 54 కిలోల గంజాయి, కారు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మూడు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శివ, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకోగా, గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నారు. అలాగే కర్నాటకలోని కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం బీదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జాన్వదేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే ప్రాంతానికి చెందిన వీరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గంజాయి సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, డీసీఎం డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన రాజుకు ఏపీలోని రాజమండ్రికి చెందిన కోమలి, బుడ్డ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీరాం, చంద్రకాంత్, ఎండీ.లతీఫ్, సంతోశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీలేరు ప్రాంతంలోని రామారావు  అనే వ్యక్తి వద్ద గంజాయి కొని డీసీఎంతో పాటు, రెండు కార్లలో లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని కర్నాటక వెళ్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడలోని ఖలీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాబా వద్ద పోలీసులు పట్టుకొని డీసీఎంలో ఉన్న 300 కిలోలు, రెండు కార్లలో ఉన్న 80 కిలోల గంజాయితో పాటు డీసీఎం, కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, కోమలి, రాజు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న డీఎస్పీలు వై.వెంకటేశ్వరరావు, మొగిలయ్య, సీఐలు ముత్తినేని సత్యనారాయణ, రాఘవేందర్, ఎస్సై నరసింహులు, శివతేజను ఎస్పీ అభినందించారు. 

గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

సూర్యాపేట, వెలుగు : విశాఖ నుంచి కేరళకు గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని ఆత్మకూరు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై యాదవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుప్తా విశాఖపట్నంలో గంజాయి కొని కేరళకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆత్మకూరు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మండలం నెమ్మికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద వేచి ఉండగా పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా గంజాయి విషయం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి

మునుగోడు, వెలుగు : గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ నల్గొండ జిల్లా మునుగోడు వార్డు సభ్యులు శుక్రవారం పంచాయతీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధులు కేటాయించకపోవడంతో వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని, దీంతో వార్డుల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించాలని సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి నిధులు కేటాయించాలని, లేకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఉప సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పందుల పవిత్ర శ్రీను, పందుల నరసింహ, యాట రామస్వామి, ఎడవల్లి సత్యవతి సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎర్రబెల్లి శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే...

చండూరు, వెలుగు : తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఆర్.ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చండూరులో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా బహిరంగ సభతో అధికార పార్టీలో వణుకు పుట్టిందన్నారు. మునుగోడు అభివృద్ధికి పదవిని త్యాగం చేసిన రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బీజేపీలో 
చేరడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలం పెరిగిందన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు అన్నేపర్తి యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షుడు కోమటి వీరేశం, సముద్రాల వెంకన్న, దర్శనం వేణు, కొత్తపాటి సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిలుకూరి అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోడ ఆంజనేయులు, భూతరాజు దేవదాసు పాల్గొన్నారు.

సిరిపురంలో యునిసెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం పర్యటన

యాదాద్రి (రామన్నపేట), వెలుగు : పారిశుద్ధ్య నిర్వహణ సరిగా  ఉంటే పైలేరియా కేసులు ఎలా పెరిగాయని యునిసెఫ్, యూఎంసీ ప్రతినిధులు అరవింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకట రమణ, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో శుక్రవారం వారు పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్మికుల ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు, వారికి అందుతున్న జీతాలు, ప్రోత్సాహకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లు, స్కూళ్లలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. ఈ విషయాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు అందజేస్తామన్నారు. వారి వెంట డీపీఎం సురేశ్, ఎంపీడీవో జలంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పం లక్ష్మీనర్సు, ఎంపీటీసీ బడుగు రమేశ్, ఏపీవో వెంకన్న, సెక్రెటరీ జ్యోతి ఉన్నారు. 

నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవరాత్రి ఉత్సవాల కోసం జిల్లాలో పటిష్టమైన బందోబస్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. జిల్లా పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మండపాల ఏర్పాటు కోసం తప్పనిసరిగా పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలన్నారు. కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడకుండా ఎప్పటికప్పుడు క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రవి, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీఆర్బీ ఇన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెక్టర్లు శ్రీనివాస్, నర్సింహ, రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగార్జున, రాజశేఖర్ పాల్గొన్నారు.

బీజేపీలో చేరికలు

చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు బీజేపీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జాల రామకృష్ణ, జాల రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాతాల గీత, దోర్నాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు పల్లె వెంకన్న, నాతాల వనజ విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండు ద్రౌపది వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విండో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్ట భిక్షం 
పాల్గొన్నారు.

పేదలకు ఆర్థికసాయం

నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని పలువురు పేదలకు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని మహ్మదాపురానికి చెందిన తెలగమల్ల మురళికి రూ. 2 లక్షలు, లక్ష్మణపురానికి చెందిన బాణావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైదులు, బండ తిమ్మాపురానికి చెందిన బుడిగపాక రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పసునూరుకు చెందిన భూతం అంజయ్య, రాందాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తండాకు చెందిన మెగావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్రి, కుర్ర ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. లక్ష చొప్పున 
అందజేశారు.

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కుల పంపిణీ

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 158 మందికి మంజూరైన సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాధవరం సునీతా జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, వంగాల ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీవీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, వల్లపురెడ్డి, హన్మంతు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పున్న వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

యాదాద్రి (రామన్నపేట), వెలుగు : గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. రామన్నపేట మండలం నరినేనిగూడెం అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడారు. గర్భిణులు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యోగా చేయాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకే మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. అంతకు ముందు భువనగిరి భవిత సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించి, చిన్నారులతో మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తివారి, డీఈవో కె.నారాయణరెడ్డి, వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణవేణి, కో ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నల్గొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీడీవో యాదగిరిగౌడ్, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, మేకల రాజిరెడ్డి, దుబ్బాక పావని శ్రీధర్ పాల్గొన్నారు.

పాత ఘాట్ రోడ్డు రిపేర్లు షురూ

మూడు నెలల్లో అందుబాటులోకి ..

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాత ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులను శుక్రవారం ఆర్ అండ్ బీ ఆఫీసర్లు మొదలుపెట్టారు. ఈ నెల 3, 4 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఘాట్ రోడ్డు రెయిలింగ్ కోతకు గురై కుంగిపోయి..  సిమెంట్ మిక్సర్ లారీ బోల్తా పడి జార్ఖండ్ కు చెందిన ఓ కార్మికుడు చనిపోయాడు. దీంతో పాత ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఎగ్జిట్ ఘాట్ రోడ్డు నుంచే  కొండపైకి, కొండ కిందికి రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో పాత ఘాట్ రోడ్డును పూర్తిగా స్థాయిలో మరమ్మత్తులు చేయడానికి ఆఫీసర్లు శుక్రవారం పనులు ప్రారంభించారు. కుంగిపోయిన  ఘాట్ రోడ్డు ఎడమ వైపు భాగాన్ని మొత్తం తొలగిస్తున్నారు.  బేస్ లెవల్ నుంచి జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు. మట్టి తొలగింపు పనులు కంప్లీట్ కాగానే.. ఘాట్ రోడ్డు ఎంట్రీ నుండి ఫస్ట్ టర్నింగ్ వరకు లెఫ్ట్ సైడ్ లో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తారు. కార్తీకమాసానికి  ఘాట్ రోడ్డును అందుబాటులోకి తెస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. 

సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్ల బలోపేతానికి కృషి

కోదాడ, వెలుగు : విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. మండలంలోని పలు జడ్పీ హైస్కూళ్లకు శుక్రవారం సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరికరాలను పంపిణీ చేసి మాట్లాడారు. మన ఊరు మన బడి పథకంతో, స్థానిక సంస్థల నిధులతో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. స్కూళ్లలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కోదాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆసరా లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఎంపీపీ చింతా కవిత, ఎంపీడీవో విజయ శ్రీ, ఎంఈవో సలీం షరీఫ్, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లక్ష్మీనారాయణ, శెట్టి సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయుడు, విజయకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.