ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం

ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం

సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో ఆదివారం(ఫిబ్రవరి 18) కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి పట్నాలు , బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. 

మల్లికార్జున స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి 3 గంటలు, ధర్మ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. పెద్దఎత్తున తరలి వచ్చిన భక్తులతో కొమురవెల్లి ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.