కొమురవెల్లిలో ఎండలోనే భక్తులు

కొమురవెల్లిలో ఎండలోనే భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆదివార వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అయితే చలువ పందిళ్లు చాలకపోవడంతో ఎండలో నిల్చున్నారు. ఈ విషయంలో ఆలయ ఈవో బాలాజీని వివరణ కోరగా.. భక్తులు ఎక్కువగా రావడంతో పందిళ్లు సరిపోలేదని, పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తామన్నారు.