కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

వికారాబాద్, వెలుగు:  కోణార్క్​ఎక్స్​ప్రెస్​రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. వికారాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్​తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని​సనత్​నగర్​కు చెందిన కోమటిరెడ్డి మోహన్​రెడ్డి(42) గురువారం  పల్నాడు ఎక్స్​ప్రెస్ రైలులో వికారాబాద్​వస్తున్నాడు. రైలు గొల్లగూడ రైల్వే స్టేషన్​లో ఆగింది. మోహన్​రెడ్డి ట్రైన్​దిగాడు. కాసేపటికే రైలు స్టార్ట్​అయి వెళ్లిపోయింది. దీంతో అతను అక్కడే ఉండిపోయాడు. వెనకాలే వచ్చిన కోణార్క్ ఎక్స్ ప్రెస్​ రైలు ఢీకొట్టడంతో మోహన్​రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.