పరిగి వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోదీని మూడోసారి ప్రధాని చేయాలని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర శుక్రవారం పరిగిలో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొందపెట్టాలన్నారు.
కేసీఆర్ పాలనపై ప్రజలు విశ్వాసం కోల్పోయినందునే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. దేశ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కరువయ్యారని, ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకుని నిలబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మన పిల్లల కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్కోసం మోదీని గెలిపించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.