ఆనంద్ రవి, కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో సమన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కొరమీను’. డిసెంబర్ 31న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా సోమవారం సాంగ్ను రిలీజ్ చేశారు. దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత గెస్టులుగా పాల్గొని టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఆనంద్ రవి మాట్లాడుతూ ‘మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారనేది కాన్సెప్ట్. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. డిసెంబర్ 31న సినిమాను చూసి న్యూ ఇయర్ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.
నటనకు ప్రాధాన్యమున్న మీనాక్షి అనే రోల్ చేశానని చెప్పింది హీరోయిన్ కిషోరీ. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆనంద్ రవి మంచి కథను అందించారు. అలాగే స్ర్కీన్ప్లే, డైలాగ్స్ కూడా రాయడంతో డైరెక్షన్ చేయడం కష్టమనిపించలేదు’ అన్నాడు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని, సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత సమన్య రెడ్డి. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.