ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం.. రాజధాని బస్సు దగ్దం..

ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం.. రాజధాని బస్సు దగ్దం..

జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆర్టీసీ రాజధాని బస్సు పూర్తిగా దగ్ధం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల ఆర్టీసీ డిపోలో రాజధాని బస్సులో పెట్రోల్ పోస్తున్న సమయంలో మంటల చెలరేగాయి. బస్సు బ్యాటరీల నుంచి ఒక్కసారిగా మంటల చెలరేగాయి.

ALSO READ : రన్నింగ్ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం.. 

దీంతో అక్కడి వారంతా భయాందోళన చెందారు. ఈ ప్రమాదం బస్సు పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.