దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో పంచాయతీలే కీలకం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో పంచాయతీలే కీలకం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  •     కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో పంచాయతీలే కీలకమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గిరిజన లంబాడ సంఘాల జాయింట్​యాక్షన్​ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్​లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో లంబాడ గిరిజన సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జేఏసీ చైర్మన్​ ఇస్లావత్​ లక్ష్మణ్​ నాయక్​ మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు సర్పంచులు కృషి చేయాలని సూచించారు. 

గ్రామాల్లో యువత గంజాయి బారిన పడకుండా సర్పంచులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా, జేఏసీ నేతలు గుగులోత్​ రాజేశ్, రమేశ్, ప్రసాద్, జుంకీలాల్, వెంకటేశ్వర్లు, విఘ్నేష్​, లాలు నాయక్​, కృష్ణ, హథీరాం, రవి రాథోడ్​, బాదావత్​ శాంతి, శ్రీనివాస్, మంగీలాల్, మోహన్, రాంబాబు పాల్గొన్నారు.