సెప్టెంబరులో కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలు.. చరిత్ర, చారిత్రక ఘట్టాలు..

సెప్టెంబరులో కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలు..  చరిత్ర, చారిత్రక ఘట్టాలు..

కోఠి మహిళలా కళాశాల..మహిళా సాధికారతలో మరో మైలురాయిని అందుకోనుంది. సెప్టెంబరులో కోటి మహిళా కళాశాల వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని శతాబ్ధి ఉత్సవాలను జరుపుకోనుంది. ఒక శతాబ్దం పాటు వృత్తులను అభివృద్ధి చేసి, మహిళలకు సాధికారతను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలను..కోఠి మహిళాల అని కూడా పిలుస్తారు.  కోఠి మహిళా కళాశాల అందించిన సేవలు, కళాశాల స్థాపన నేపథ్యం గురించి తెలుసుకుందాం. 

 కోటి మహిళా కళాశాల శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెట్టింది. చారిత్రాత్మక భవనాలు,  అభివృద్ధి చెందుతున్న ఉద్యానవనాలతో నగరం మధ్యలో ఈ కళాశాల ఉంది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అభ్యర్థన మేరకు అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1924లో హైదరాబాద్‌లో విద్యాభ్యాసం ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పిలువబడే సంస్థను స్థాపించారు.

నిజాం సంస్థానంలో  ఈ సంస్థ.. ఇంటర్మీడియట్ హ్యుమానిటీస్ స్టడీస్‌తో "గోల్డెన్ థ్రెషోల్డ్"లోని నాంపల్లి బాలికల పాఠశాల మైదానంలో ఈ కళాశాల పనిచేయడం ప్రారంభించింది. 1935లో శాస్త్రీయ కోర్సులు ప్రారంభించారు. ఆ తర్వాత కళలు, సామాజిక శాస్త్రాలలో డిగ్రీ కోర్సులు అందించబడ్డాయి. ఇప్పుడు కొన్ని డిప్లొమా డిగ్రీలతో పాటు77 అండర్ గ్రాడ్యుయేట్, 20 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. 
వచ్చే నెల నుంచి ఏడాదిపాటు వేడుకలు
కళాశాల కాలక్రమేణా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఉన్నత విద్యను కోరుకునే విద్యార్థులు ఎక్కువగా ఈ కళాశాలను ఎంచుకునేలా రూపుదిద్దుకుంది. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల సంఖ్య మొదటి తరం క్రమంగా పెరుగుతూ వేల మంది మహిళల సాధికారితకు కృషి చేసింది. విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు , చిన్న , పెద్ద-తెర నటులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, దర్శకులను ఉత్పత్తి చేసే సుదీర్ఘ చరిత్రను కోఠి మహిళా కళాశాల కలిగి ఉంది.
శతాబ్ది ఉత్సవాలు
సెప్టెంబరులో ప్రారంభమై.. ఏడాదిపాటు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. ప్రారంభోత్సవంలో భాగంగా స్నాతకోత్సవం, వార్షిక దినోత్సవం, ప్రపంచ పూర్వ విద్యార్థుల సమావేశం, బహిరంగ సభ, ప్రదర్శనలకు ప్రణాళిక సిద్దం చేశారు. ఏడాది పొడవునా నిర్వహించే సమావేశాలు, సెమినార్‌లు ,ప్రముఖ ఉపన్యాసాలతో పాటు, వాకథాన్ లేదా రన్ కూడా నిర్వహిస్తామని కళాశాల నిర్వాహకులు తెలిపారు.