
ములుగు, వెలుగు: ములుగు మండలం కొట్యాల గ్రామంలోని కేతాలమ్మ, మేడాలమ్మ సమేత మల్లికార్జున స్వామి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఆలయ నిర్మాత గంగిశెట్టి నాగలక్ష్మి గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి, హోమం చేపట్టారు. అనంతరం శివపార్వతుల కల్యాణాన్ని వైభవోపేతంగా భక్తుల సన్నిధిలో నిర్వహించారు. సాయంత్రం వీరభద్ర స్వామి కల్యాణం తో పాటు అగ్నిగుండాల కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఏ టూ జెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జుబేర్ పాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గుప్తా, మాజీ పీఏసీఎస్చైర్మన్ కొమురవెల్లి ప్రభాకర్ గుప్తా, మాజీ జడ్పీటీసీ ఎల్లా గౌడ్, మాజీ సర్పంచులు అర్జున్ గౌడ్, భూపాల్ రెడ్డి, జ్యోతి విజయ రెడ్డి, రోటరీ చైర్మన్ జగదీశ్వర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాత గణేశ్ గుప్తా అతిధులందరికీ శాలువాలు కప్పి సత్కరించారు. కొట్యాల మల్లన్న ఆలయ ప్రాంగణమంతా ఓం నమశ్శివాయ నాదంతో మార్మోగింది. కార్యక్రమంలోని నవీన్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్నారు.