క్రేజీ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి..!

క్రేజీ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి..!

మలయాళ ముద్దుగుమ్మ కృతి శెట్టికి టాలీవుడ్ లో యమా క్రేజ్ ఉంది. ఈ అమ్మడు తెలుగులో మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. 'ఉప్పెన'మూవీలో తన అందం,అభినంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ప్రస్తుతం ఈ సుందరి వరుస అవకాశలను అందిపుచ్చుకుంటుంది.ఇప్పటికే కృతి మరో మూడు సినిమాల్లో నటిస్తోంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం', 'ది వారియర్' సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ కోలీవుడ్ లో మరో క్రేజీ అఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే హీరో సూర్యకు జోడీగా నటిస్తోంది. డైరెక్టర్ బాలా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. ఇక తాజాగా ధనుశ్ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించినట్లు సినీ వర్గాల టాక్.ధనుశ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపించింది.అయితే ఇప్పుడు కృతి శెట్టి పేరు తెరపైకి వచ్చింది.మరి ప్రియాంకతో పాటు కృతి శెట్టిని తీసుకున్నారా? లేదంటే  ప్రియాంకకు బదులుగా  తీసుకున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.