- వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన కేఆర్ఎంబీ
హైదరాబాద్, వెలుగు: మే నెల చివరి నాటికి తెలంగాణ 85, ఏపీ 20 టీఎంసీల నీళ్లు నాగార్జునసాగర్ నుంచి తీసుకునేందుకు కేఆర్ఎంబీ సోమవారం వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. శ్రీశైలంలో ఎండీడీఎల్కు ఎగువన నీళ్లు లేనందున ఆ ప్రాజెక్టు నుంచి నీటి వినియోగానికి అనుమతించలేదు. నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీ లిఫ్ట్, హైదరాబాద్ తాగునీటికి 85 టీఎంసీలు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఏపీ ఎడమ కాల్వకు 8, కుడి కాల్వకు 12 టీఎంసీలు వాడుకునేందుకు ఓకే చెప్పారు. ఈ నెల 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన త్రీ మెంబర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిలీజ్ ఆర్డర్ ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు.