పంబలో అయ్యప్ప భక్తుల బస్సులో మంటలు

 పంబలో అయ్యప్ప భక్తుల బస్సులో మంటలు

అయ్యప్పలు ప్రయాణించే కేఎస్​ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.  పంబా... నీలక్కల్​ మార్గ మధ్యలో కేఎస్​ ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమదం సంభవించింది.  ఈ ప్రమాదానికి షార్ట్​ సర్క్యూట్​ కారణమని అధికారులు చెబుతున్నారు.  ఘటనా వివరాల్లోకి వెళ్తే...

నీలక్కల్ నుంచి శఅయ్యప్ప యాత్రికులతో పంబకు చేరుకున్న కేరళ ఆర్టీసీ బస్సులో శనివారం( జనవరి6)  ఉదయం 8:30 గంటలకు బస్సులో మంటలు చెలరేగాయి. సమీపంలోనే అగ్నిమాపక కేంద్రం ఉండడంతో మంటలు అదుపుచేశారు. అప్పుడే అయ్యప్పలు అందరు బస్సు దిగారు. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో డ్రైవర్​, క్లీనర్​ మాత్రమే ఉన్నారు.  బస్సు మధ్యలో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్​, క్లీనర్​ బస్సు దిగారు.  ఎదురుగా అగ్నిమాపక కేంద్రం ఉండటంతో అప్రమత్తమైన ఫైర్​ సిబ్బంది మంటలను అదుపు చేశారు.