నవంబర్ 17 నుంచి గ్రేటర్​లో కేటీఆర్ ​రోడ్డు షోలు : తలసాని శ్రీనివాస్ ​యాదవ్

నవంబర్ 17 నుంచి గ్రేటర్​లో కేటీఆర్ ​రోడ్డు షోలు : తలసాని శ్రీనివాస్ ​యాదవ్

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​హైదరాబాద్​పరిధి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ఈ నెల 17 నుంచి రోడ్డు షోలు నిర్వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తెలిపారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్​ ప్రచార సభలు, కేటీఆర్​ రోడ్డు షోలపై శనివారం తెలంగాణ భవన్​లో హైదరాబాద్​జిల్లా ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడారు. గ్రేటర్​లోని అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్​రోడ్డు షోలు ఉంటాయని తెలిపారు.

25న కేసీఆర్  సభ కోసం పరేడ్ ​గ్రౌండ్​తోపాటు ఎల్బీ స్టేడియం నిర్వాహకులను అనుమతి కోరామని తెలిపారు. రేవంత్​రెడ్డి తన భాష మార్చుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.  రేవంత్​రెడ్డి, ఈటల రాజేందర్​తమను తాము అతిగా ఊహించుకుంటున్నారన్నారు. తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసి కూడా ఆయా పార్టీల అధిష్టానం మెప్పుకోసమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. అంబర్​పేటలో ఓడిపోతాననే భయంతోనే కిషన్​రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారని, రెండు సీట్లలో కూడా గెలవలేని బీజేపీ.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.