హైదరాబాద్​లో 24 గంటలు నీళ్లిస్తం :  కేటీఆర్ 

హైదరాబాద్​లో 24 గంటలు నీళ్లిస్తం :  కేటీఆర్ 

ముషీరాబాద్,వెలుగు: నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 24 గంటలు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి రామ్ నగర్ గుండు నుంచి భోలక్​పూర్ లో ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ తో కలిసి  రోడ్ షో నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఆగం కాకుండా బీఆర్ఎస్ కే  ఓటు వేయాలని కోరారు.

కాంగ్రెస్ వాళ్లకు వచ్చింది లేదు.. పోయింది లేదు డిసెంబర్ 9న ముహూర్తం పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఆరు నెలలకు ఒకరు మారే ముఖ్యమంత్రి కావాలా... ప్రజల సంక్షేమం కోరే కేసీఆర్ మనకు కావాలా.. అన్నారు. ముఠా గోపాల్ చెప్పినట్టు ఇందిరా పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తామని, పార్క్ నుంచి బుద్ధుడి విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రోడ్​ షోలో వి శ్రీనివాస్ రెడ్డి, ముఠా జై సింహ, నగేష్ ముదిరాజ్, సంగిశెట్టి జగదీశ్వర్  పాల్గొన్నారు.