హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ ద్వారా తన కుటుంబం వేల కోట్లు సంపాదించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే సంజయ్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం కేసు నడుస్తున్నా.. మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
శనివారం బండి సంజయ్తో పాటు ఎంపీ అర్వింద్కు కేటీఆర్ లీగల్నోటీసులు పంపించారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని.. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
