హైదరాబాద్: అవినీతిపై స్కాంగ్రెస్ పార్టీ వారసుడు రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ట్వీట్ చేశారు. ‘టికెట్లు అమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడు.
పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అప్పటి ఇంచార్జ్ అమ్మితే రేవంత్ కొన్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో? ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదం’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.