
- గెస్ట్హౌస్లో ఎమ్మెల్సీ తండ్రి, కార్పొరేటర్ పేకాట
- కూకట్పల్లిలో ఎస్ఓటీ పోలీసుల దాడి..మొత్తం 11 మంది అరెస్టు
కూకటపల్లి, వెలుగు: కూకట్పల్లిలోని ఓ గెస్ట్హౌస్లో పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం బాలానగర్ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కూకట్పల్లికి చెందిన బీఆర్ఎస్ఎమ్మెల్సీ నవీన్కుమార్తండ్రి కొండలరావుతో పాటు ఆల్విన్కాలనీ డివిజన్కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్దొడ్ల వెంకటేశ్గౌడ్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
కూకట్పల్లి పరిధి వైష్ణవికాలనీలోని ప్లాట్నంబర్27లో ఉన్న గెస్ట్హౌస్లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కొండలరావు, వెంకటేశ్ గౌడ్తోపాటు తులసిరావు, బలరావు, అనిల్కుమార్, భాస్కర్రావు, శ్రీనివాసరావు, భాస్కర్, రంగారావు, నాగేశ్వరరావు, మురళీమోహన్అరెస్ట్చేశారు. నిందితుల నుంచి రూ. 2.52 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్స్స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు.