ప్రగతి భవన్‌ లో జాతీయ రాజకీయాలపై చర్చ

 ప్రగతి భవన్‌ లో జాతీయ రాజకీయాలపై చర్చ

జాతీయ రాజకీయల్లోకి వెళ్తానని ప్రకటించాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ రాజకీయాలపై కేసీఆర్తో కుమారస్వామి చర్చించుకున్నట్లు సమాచారం. ఇదే నెలలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ను కలిశారు కుమారస్వామి. ఆ భేటీలో కూడా జాతీయ రాజకీయాలపై చర్చి జరిగినట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీలో ఏ అంశాల ఆధారంగా ముందుకు వెళ్లాలనే దానిపై.. చర్చ జరుగుతన్నట్లు సమాచారం.