![ఆరు గ్యారెంటీలతో అందరికీ లబ్ధి : కుంభం అనిల్కుమార్రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/11/kumbam-anil-kumar-reddy-says-all-people-benefit-from-six-guarantees-given-by-congress_iRY0pDr19L.jpg)
- కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో ప్రజలందరికీ లబ్ధి కలుగుతుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డి చెప్పారు. ఆదివారం నియోజకవర్గంలోని బీబీనగర్, భువనగిరి మండలాల్లోని పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని విమర్శించారు.
ALSO READ : కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం: సరిత
కాంగ్రెస్ గెలిస్తే ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని వెల్లడించారు. కర్నాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు లీడర్లు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్లో చేరారు.