బీఆర్ఎస్ ను మరోసారి నమ్మి మోసపోవద్దు :  కూన శ్రీశైలంగౌడ్​ 

బీఆర్ఎస్ ను మరోసారి నమ్మి మోసపోవద్దు :  కూన శ్రీశైలంగౌడ్​ 

జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్​ఎమ్మెల్యే వివేకానంద్​ను  మరోసారి నమ్మి మోసపోవద్దని కుత్బుల్లాపూర్​బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని  ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో భూ కబ్జాలు,సెటిల్​మెంట్లు, దందాలతో  ఎమ్మెల్యే, అతని అనుచరులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ప్రజలు నమ్మకంతో రెండు సార్లు గెలిపిస్తే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

100 పడకల ఆస్పత్రి, జగద్గిరిగుట్ట బస్​ డిపో, టిమ్స్​ ఆస్పత్రి ఏమైందని ప్రశ్నించారు. ఒక్క కొత్త రేషన్​కార్డు, కొత్త ఫించన్​ఇవ్వలేదన్నారు. డబుల్​ ఇండ్లకు లక్షమంది దరఖాస్తులు  చేస్తే ఒక్కరికి కూడా పొజిషన్​ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 30న జరిగే పోలింగ్​లో బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.