ఆస్పత్రిలో చేరిన నటి కుష్బూ.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి

ఆస్పత్రిలో చేరిన నటి కుష్బూ.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి

ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం కారణంగా హాస్పిటల్ లో చేరానంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫొటోలను షేర్ చేసిన ఆమె.. శరీరమంతా నొప్పులు, జ్వరం, నీరసంతో బాధపడుతున్నానన్నారు.  తనకు ఎడినో వైరస్‌ సోకిందని, అందుకే చాలా కష్టంగా, బలహీనంగా అనిపిస్తోందని తెలిపారు. ఎవరికైనా వైరస్‌ సోకినట్టుగా ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి అని కుష్బూ ట్విట్టర్ వేదికగా సూచించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఆమె ఆరోగ్యంపై పలువురు ప్రముఖులతో పాటు, అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కుష్భూ అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పడంతో నెటిజన్లు పలురకాలు కామెంట్లు పెడుతున్నారు. ఆమె త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అంటున్నారు. ఈ సందర్భంగా సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా కామెంట్ చేశారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అదే తరహాలో పలువురు ప్రముఖులు ఆమె ఆరోగ్యంపై స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు.

https://twitter.com/khushsundar/status/1644230692115746816